జాతీయ స్థాయిలో ఎల్లారెడ్డిలోని ఆర్టిస్ట్ గా గోపాల్ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ రాజేందర్ నాథ్ లు ఎదగడం అభినందనీయమని మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మెన్ కుడుముల సత్యనారాయణ అన్నారు. బుధవారం రాత్రి ప్రముఖ ఆర్టిస్ట్, భారత్ విభూషన్ అవార్డు గ్రహీత గోపాల్ గౌడ్, ఎన్యూజే (ఐ)జాతీయ ఉపాధ్యక్షునిగా ఎన్నికైన వి. రాజేందర్ నాథ్ లను ఎల్లారెడ్డి ఏఎంసీలో కాంగ్రెస్ నేతలు సత్కరించారు.