కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని గ్రామ నర్సరీని బుధవారం ఎంపీడీవో కమలాకర్ సందర్శించారు. ఆయన ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చినట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి యాదగిరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో శివ గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.