కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని శాంతినగర్ కలానిలో బుధవారం మురుగు నీటి (మోరి)నీటి ప్రవాహం ఎక్కువై ఇండ్లలోకి నీళ్లు వస్తున్నాయని, అధికారులకు తెలిపితే పట్టించుకోవడంలేదని కాలని వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురికి నీటిని శుభ్రం చేయించాలని తమ సమస్యను తీర్చాలని వేడుకుంటున్నారు.