తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశా కార్యకర్తలు మండల వైద్యాధికారి యెమీమాకు వినతి పత్రం సమర్పించారు. డిమాండ్స్ డే సందర్భంగా తమకు కనీస వేతనాలు అమలు చేయాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు పద్మ, ఆశా కార్యకర్తలు సవిత రేణుక పాల్గొన్నారు.