కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద 134వ జయంతిని పురస్కరించుకుని 11వ వార్డ్ కౌన్సిలర్ శ్రీను, 9వ వార్డు కౌన్సిలర్ పడిగే సుగుణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప మేధావి అని కొనియాడారు. నేటి యువత వారి బాటలో నడవాలని, గ్రామ ప్రజల అందరి ముందు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ యువజన సంఘ అధ్యక్షులు రాములు, తదితరులు పాల్గొన్నారు.