ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భిక్నూర్ తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. బుధవారం ఆశా వర్కర్లు తమ విధులను బహిష్కరించారు. అనంతరం తాసిల్దార్ శివప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. తమ సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మండల వైద్యాధికారి హేమిమాకు వినతి పత్రం అందజేశారు.