జాతీయ సామాజిక న్యాయ సాధికారత సంస్థ ఆధ్వర్యంలో జాతీయ కార్యశాలకి తెలంగాణ రాష్ట్రం నుండి బీబీపేట మండల కేంద్రానికి చెందిన తంగలపల్లి సంతోష్ గౌడ్ ఎంపికైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూ ఢిల్లీలో నిర్వహించిన మూడు రోజుల కార్యశాలలో ట్రాన్స్ జెండర్స్, భిక్షాటకుల, మాదక ద్రవ్యాల బాధితుల, వృద్ధుల సంక్షేమంపై సోషల్ వర్క్ ఎడ్యూకెటర్స్ కి శిక్షణను ఇచ్చారని, తమ అభిప్రాయాలను సైతం తీసుకున్నారని తెలిపారు.