కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటూ శుక్రవారం చలో కలెక్టరేట్ ర్యాలీ నిర్వహించారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్యెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ రైతు వింగ్ నేతలు కలిసి ర్యాలీగా నినాదాలు చేస్తూ. కామారెడ్డి కలెక్టరేట్ వరకు వెళ్లి అదనపు కలెక్టర్ కు అందోళనకారులు వినతిపత్రం సమర్పించారు.