కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మానసకు అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తాన్ని కళ్యాణి విజయ్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలవడం జరిగిందని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు బుధవారం తెలిపారు. బాలు మాట్లాడుతూ, ఒక రక్తదాత ఇచ్చే రక్తంతో ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చునని, ప్రస్తుతం రక్తనిధి కేంద్రాలలో రక్తనిలువలు తక్కువగా ఉన్నాయన్నారు.