కామారెడ్డిలో ఘనంగా ఎడ్లబండ్ల ప్రదర్శనలు

573చూసినవారు
కామారెడ్డిలో ఘనంగా ఎడ్లబండ్ల ప్రదర్శనలు
తెలుగు సంవత్సరాది ఉగాదిని మంగళవారం నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ఆలయాల్లోకి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పచ్చడిని తయారు చేసుకుని ఇంటిల్లిపాది స్వీకరించారు. సాయంత్రం గ్రామాల్లో ఎడ్లబండ్ల ప్రదర్శనలు ఉత్సాహంగా జరిగాయి. భిక్కనూర్ మండలం తిప్పాపూర్ లో హిందూ సేన యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మీకోసం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహేష్ యాదవ్ వారిని శాలువలతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్