
జూన్ 15న అకౌంట్లలోకి రూ.15,000: మంత్రి సవిత
ఏపీలో ‘తల్లికి వందనం' పథకం కింద చదువుకునే పిల్లలందరికీ జూన్ 15న ₹15,000 చొప్పున అందిస్తామని మంత్రి సవిత పేర్కొన్నారు. భావితరాల భవిష్యత్ కోసం సీఎం చంద్రబాబు పటిష్ఠమైన విద్యా వ్యవస్థకు పునాదులు వేస్తున్నారన్నారు. టెన్త్, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన గురుకుల విద్యార్థులకు గురువారం విజయవాడలో మంత్రి నగదు ప్రోత్సాహకాలు అందించారు. బీసీ యువతకు సివిల్స్, మెగా డీఎస్సీకి ఉచిత శిక్షణను అందిస్తున్నామన్నారు.