మనవరాలిని తాత కిడ్నాప్ చేసిన ఘటన శనివారం కామారెడ్డిలో చోటుచేసుకుంది. మేడ్చల్ సమీపంలోని మచ్చ బొల్లారంకు చెందిన కలియ స్వప్న భర్త రాముతో గొడవల కారణంగా 18 నెలల కుమార్తె అంజలితో కలిసి కామారెడ్డిలోని జీవధాన్ ఆసుపత్రి ప్రాంతంలో బంధువుల ఇంట్లో ఉంటుంది. అంజలిని స్వప్నకు దూరం చేయాలనే ఉద్దేశంతో ఎత్తుకొని వెళ్ళిపోయాడు. బాలికను తల్లికి అప్పగించి నిందితుని రిమాండ్ కు తరలించినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.