మానవహక్కుల సంఘం బిక్కనూర్ మండల అధ్యక్షురాలుగా, షీటీం సభ్యురాలిగా బోండ్ల హారిక నియమితురాలైనట్లు హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఏ సలీం గురువారం తెలిపారు. ఈ సంధర్బంగా హారిక మాట్లాడుతూ. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తానన్నారు. ఆడవారికి ఏ సమస్య వచ్చిన వెంటనే తమకి ఫోన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మానవహక్కుల సంఘం మండల కార్యదర్శి లింగాల నవీన్ గౌడ్ పాల్గొన్నారు.