కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం గ్రామంలో శుక్రవారం జగదీశ్వర్ గౌడ్, పావనిల వివాహ వేడుకకు జుక్కల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే హాజరయ్యారు. అనంతరం నూతన వధూవరులను హనుమంత్ షిండే ఆశీర్వదించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన అండగా ఉంటుందని తెలిపారు.