వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతి సౌకర్యాలు కల్పించాలని, తూకం సరిగా వేయాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి. విక్టర్ అన్నారు. శనివారం లింగంపేట్ మండలం కోమటిపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలని, త్రాగునీరు, టార్పాలిన్, తదితర ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ అన్నారు.