భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా చరిత్రలో చెరగని స్థానాన్ని సంపాదించినటువంటి సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ మహిళ అన్ని రంగాలలో ముందంజలో ఉన్నదని సావిత్రిబాయి పూలే యొక్క ఆశయాలను దృష్టిలో ఉంచుకొని మహిళా అధ్యాపకులు అందరూ తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.