ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే సాంకేతిక నైపుణ్యం చాలా ముఖ్యం. దీంతో పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు చదువుతో పాటు టెక్నికల్ విద్యను అందించేందుకు ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని గురువారం జిల్లా సెక్రెటరీ శ్రీకాంత్ అన్నారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణను అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఏఐ, కోడింగ్, మిషన్ లెర్నింగ్, రోబోట్, వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు.