కామారెడ్డి పట్టణం దేవునిపల్లి గ్రామంలో కీర్తి శేషుల కాసర్ల శివరాజయ్య జ్ఞాపకార్థంగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను శనివారం కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, బీజేపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.