జిల్లాలో 2024-25 రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు జోరుగా కొనసాగుతున్నదని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 446 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 62830 మంది రైతుల నుండి 776 కోట్ల విలువైన 3. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ తో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా తృతీయ స్థానంలో నిలిచింధన్నారు.