రాజకీయ దురంధరుడు ధర్మపురి శ్రీనివాస్ అని భారత జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్టీమల్ల అనంతరాములు అన్నారు. ఆయన మృతి తెలంగాణ రాజకీయలకు ఎంతో దిగ్బ్రాంతి కలిగించిందని పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఎనలేనిదని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్ని శాసించి పీసీసీ అధ్యక్షునిగా, మంత్రిగా, ఎంపీగా, రాజ్యసభ సభ్యునిగా ఎన్నో పదవులకు న్యాయం చేశారని అన్నారు.