జాతీయ మానవ హక్కుల కమిషన్ జిల్లా ఉపాధ్యక్షులుగా పోడియం సందీప్ రెడ్డిని నియమించారు. ఆదివారం జరిగిన సమావేశంలో జాతీయ చైర్మన్ మహమ్మద్ యాసిన్, రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఆయన నియమించడం జరిగిందని జిల్లా అధ్యక్షులు మైపాల్ తెలిపారు. భిక్నూర్ మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన సందీప్ రెడ్డి ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్నారన్నారు. ఆయన సేవలను గుర్తించి జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించారు.