రాష్ట్ర ప్రభుత్వం 'ధరణి స్థానంలో 'భూభారతి' తెచ్చిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం పాల్వంచ, మాచారెడ్డి మండలాల్లో జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడుతూ. భూభారతిలో అన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయని, హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణ చేసుకోవచ్చన్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, పెండింగ్ సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారం చేస్తాం అన్నారు.