కార్మికుల డిమాండ్స్ డే సందర్భంగా బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో బిచ్కుంద పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా తాసిల్దార్ కార్యాలయం వరకు కార్మికుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ కు అందించారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు.