భిక్కనూర్ ఎస్ఐ సాయికుమార్ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ వెలికితీశారు. బుధవారం నుంచి ఎస్ఐతో పాటు బీబీపేట మహిళా కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేటలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ కనిపించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో శ్రుతి, నిఖిల్ మృతదేహాలు లభ్యమైన కొన్ని గంటల తర్వాత ఎస్ఐ మృతదేహాన్ని పోలీసులు గురువారం కనిపెట్టారు. కాగా వారి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.