ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు క్యాడర్ ను ఆహ్వానిస్తూ గాంధారి పట్టణ కేంద్రంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ వాల్ పెయింటింగ్ చేసారు. గులాబీ సైనికులారా తరలిరండి. బీఅర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలి రండి అంటూ, కేసీఆర్ జిందాబాద్ అంటూ రాసారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ. భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు సభకు తరలి రావాలన్నారు.