సదాశివనగర్ మండలం పద్మాజివాడి గ్రామ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మడిపెద్ది ఆనంద్, ఉపాధ్యక్షులుగా జాజా గంగాధర్ రావు, కార్యదర్శిగా మామిండ్ల కాషయ్య, కోశాధికారిగా తీగల ఎల్లగౌడ్, సహాయ కార్యదర్శిగా కుంట సాగర్ లు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మాజీ విడిసి అధ్యక్షులు ఎర్రవాటి గంగారెడ్డి, భాస్కర్ రావు, సుధాకర్, బాలయ్య, నడిపి లింగం, జాకీర్, వెంకట్, తదితరులు ఉన్నారు.