నిరుపేదలకు ఉచిత వైద్య శిబిరాలు వరమని ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు అన్నారు. గురువారం ఎల్లారెడ్డి ఏదవర్షిప్ సెంటర్ వద్ద యూనికార్పస్ హెల్త్ ఫౌండేషన్ & ఇండియా మెడికల్ మిషన్ ద్వారా ద మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైన శ్రీనివాసాచారి, హెప్సిబాచారిలా ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని డిఎస్పీ అన్నారు. శిబిరంలో మున్సిపల్ చైర్మన్ కె. సత్యనారాయణ పాల్గొన్నారు.