

‘ఆపరేషన్ సిందూర్’లో 100 మంది మృతి!
పాక్, POKలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం 42 మంది మృతదేహాలను గుర్తించినట్లు వివరించింది. పాక్లోని నాలుగు, POKలోని ఐదు ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఆపరేషన్లో గాయపడిన ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ తమ ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తోంది.