ఏపీలోని టీడీపీ ప్రభుత్వం సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ కు నిరసనగా మంగళవారం ఎల్లారెడ్డి అంబేద్కర్ చౌరస్థలో ఎల్లారెడ్డి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రాజేందర్ నాథ్, రాజ్ కుమార్, మహేష్, శివ, నగేష్, ముఖర్రం, గౌస్, బన్సీ, శ్రీకాంత్, యశ్వంత్పవర్, హస్నొద్దీన్ పాల్గొన్నారు.