ఎల్లారెడ్డి పట్టణంలో గురువారం ముస్లిం సోదరులు రంజాన్ పండగను ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్దతేడా లేకుండా ఈద్గా వద్ద భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసిన అనంతరం పెద్దల ఆశీర్వాదాలు తీసుకుని, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సిఐ రవీందర్ నాయక్ అధ్వర్యంలో ఎస్ఐ మహేష్ ఈద్గా వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.