ఎల్లారెడ్డి మైనారిటీ గురుకుల పాఠశాలను మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో బోధన తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో నెలకొన్న పారిశుద్ధ్య నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల హాజరు పట్టిక పరిశీలించగా సంతకాలు చేసి పాఠశాలలో లేని ఉపాధ్యాయుల పట్ల ప్రిన్సిపాల్ ని నిలదీశారు. మరొకసారి ఇదే పునరావృతం అయితే సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు