కాంగ్రెస్ సర్కార్ ధాన్యం కొనుగోలు చేసిన 24గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ, సన్నవడ్లకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తుందని ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా అన్నారు. శుక్రవారం ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఎల్లారెడ్డిలో సీఎం. రేవంత్ రెడ్డి, ఎమ్యెల్యే మదన్ మోహన్ చిత్రపటాలకు కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.