ఎల్లారెడ్డి మండలంలోని మీసాన్ పల్లి, ఆజామాబాద్, మత్తమాల గ్రామాల రైతు వేదికలో, సోమవారం రైతుబందు పథకం అమలుపై రైతుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ కోసం సొసైటి వారి ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు, ఎల్లారెడ్డి, వెల్లుట్ల, మత్తమాల సొసైటి సెక్రటరీలు విశ్వనాథం, పట్లొల్ల రాంచందర్ , పుల్గల పెంటయ్యలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.