దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకం పేదవాడి ఆత్మగౌరవ పథకమని కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఉచిత సన్న బియ్యం పేదలకు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. వినూత్న ఆలోచనతో సన్న బియ్యం పథకాన్ని అమలు చేసి పేద ప్రజల మనసు దోచుకున్నారని వెల్లడించారు.