టీజీఎంసీ వైద్య బృందం
డా.రాజ్ కుమార్ నేతృత్వంలో కరీంనగర్ జిల్లా కొదురుపాక,
బాగుపేటలో కనీస విద్యార్హతలు లేకుండా అల్లోపతి వైద్యం చేస్తున్న విషయం తెలుసుకొని తనిఖీలు నిర్వహించగా అల్లోపత
ి ఇంజక్షన్లు, యంటిబయాటిక్ స్టెరాయిడ్స్ లభించాయి. కరుణ క్లినిక్ అనే పేరుతో లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి నీలోజిపల్లి గ్రామంలో
వైద్యం చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ల్యాబ్ కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్నారని తెలిపారు. కాగా చింతకుంట గ్రామంలో భాస్కర్ ఆనంద్ క్లినిక్ అనే పేరుతో కూడా నిర్వహిస్తున్నట్లు వాటిని కూడా తనిఖీ చేసినట్లు తెలిపారు. వైద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని ఇబ్బంది పరిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని టీజీఎంసీ మెంబర్ డా.రాజ్ కుమార్ హెచ్చరించారు..