చొప్పదండి మండల కేంద్రానికి చెందిన ఉండాటి సతీష్(30) కి మానుపాటి కల అనే మహిళతో 13 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. కొద్దిరోజులుగా భార్య, ఆమె పుట్టింటి వారు సరిగా చూసుకోవడంలేదని తల్లితండ్రులకు చెప్పాడు. సతీష్ చిన్న మామ అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇవ్వమని ఇబ్బంది పెట్టాడు అన్నారు. బుధవారం రాత్రి పడుకున్న సతీష్ గురువారం ఉదయం తల్లితండ్రులు చూసేవరకు ఉరివేసుకుని కనిపించాడు. తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.