మల్యాలలో మొహర్రం వేడుకలలో భాగంగా చివరి ఘట్టంగా ఆదివారం భక్తులు అగ్నిగుండం చుట్టూ ప్రదక్షణలు చేస్తూ పీర్ల వద్ద మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులు తమ ఇంటి నుంచి తీసుకొచ్చిన కర్రలను అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణలు చేసి అందులో వేయడం అనవాయితిగా ఉంది. అస్సై దులా హారతి. కాళ్ల గజ్జెల గమ్మతీ అను పాటలు పాడుతూ గుండం చుట్టూ తిరుగుతారు. కానీ, ఈ వేడుకలకు వర్షం ఆటంకంగా మారడంతో భక్తులు లేక వెలవెలా పోయింది.