కొత్తపల్లి మండలం చింతకుంటలో దాడులు నిర్వహించి ఇస్లావత్ సావిత్రి వద్ద ఆరులీటర్ల గుండుంబా స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఎస్సై విజయభాస్కర్ తెలిపారు. అనంతరం కొత్తపల్లి మండల తహసీల్దార్ వద్ద ఒక సంవత్సరం కొరకు లక్ష రూపాయలకు బైండోవర్ చేసినట్లు పేర్కన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడుంబా తయారు చేసినా, కలిగి ఉన్నా, రవాణా చేసినా కఠిన చర్యలు చేపడుతామని హెచ్చరించారు. ఈ దాడులలో కానిస్టేబుళ్లు స్వప్న, శ్రీలత పాల్గన్నారు.