కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ అనంతరం ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. అయితే వారాహి దీక్షలో ఉన్న పవను ఆలయ అర్చకులు అమ్మవారి చరిత్రను వివరించారు. శనివారం కొండగట్టు అంజన్నను పవన్కళ్యాణ్ దర్శించుకోవడం ఇది మూడోసారి. అంజన్న ఆశీస్సులతోనే ఘనవిజయం సాధించినట్లు పలువురు జనసేన నాయకులు తెలిపారు.