వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గంగుల నగేష్ తండ్రి గంగుల సత్తయ్య ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట మాజీ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గంగుల అశోక్, పార్టీ అధ్యక్షుడు చల్లారి రాంచందర్, మూగల సత్యం, జూపాక కుమార్ తదితరులు ఉన్నారు.