భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం బుగ్గారం మండలం గంగాపూర్, వెలుగొండ గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సును కలెక్టర్ సందర్శించారు. ఈ సదస్సులో జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, తహసిల్దార్ బుగ్గారం మజీద్, ధర్మపురి తహసిల్దార్ కృష్ణ చైతన్య, రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.