ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన పారిశుద్ధ కార్మికుడు ఎల్తురి సత్తయ్య ప్రమాదవశాత్తు మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం రు. 5వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వారి వెంట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.