ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలుగా జనగామ లక్ష్మీ నియమితులయ్యారు. ఈ మేరకు ధర్మపురిలోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం ఆమెకు నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.