హుజురాబాద్: పురుగుమందు తాగి యువతి ఆత్మహత్య

61చూసినవారు
హుజురాబాద్: పురుగుమందు తాగి యువతి ఆత్మహత్య
ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లికి చెందిన మేకల సారయ్య చిన్న కుమార్తె కవిత(30) ఎంఎస్సీ, బీఈడీ చదివింది. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురైన కవిత గురువారం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ప్రొబేషనరీ ఎస్సై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్