హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రంలోని తీగల భావి ప్రాంగణంలో ఆంజనేయ స్వామి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని ఎంపీడీవో బాబుకి బుధవారం వినతి పత్రం అందజేశారు. ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో దాదాపు 150 మంది భక్తులు ప్రతిసారి హనుమాన్ మాలలు వేస్తామని ఎంపీడీవో కి తెలిపారు. తీగల బావి ప్రాంగణంలో నీటి సమస్య, మరుగుదొడ్ల సమస్యలను పరిష్కరించాలని హనుమాన్ భక్తులు కోరారు.