సైదాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం గాలి వాన బీభత్సానికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. అలాగే ఆకునూరు గ్రామానికి చెందిన నెల్లి మొగిలి అనే వ్యక్తి నివాస గృహం నేలమట్టమైంది. అకాల వర్షానికి అరబెట్టిన ధాన్యం తడిసి ముద్ద అవ్వడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఈ అకాల వర్షం అన్నదాతలకు తీవ్ర నష్టం కలిగించిందని రైతులు కన్నీరుమున్నీరయ్యారు.