రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి చెందిన ఉపాధిహామీ కూలీలను కలిసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వారికి వివరించారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అర్వింద్ ధర్మపురికి ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వేణు, ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.