
పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం
భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పాక్ మరోసారి కాల్పులకు తెగబడింది. అయితే జమ్మూలో జరిపిన ఈ కాల్పుల్లో మరో భారత జవాన్ సచిన్ యాదవ్రావు వనాంజే (29) వీరమరణం పొందారు. సచిన్ యాదవ్రావు వనాంజే స్వస్థలం మహారాష్ట్ర – తెలంగాణ బార్డర్లోని నాందేడ్ జిల్లా తమ్లూర్. ఇవాళ సచిన్ యాదవ్రావు పార్థివదేహం స్వస్థలానికి రానుంది. ఈ కాల్పుల్లో ఆయనతో పాటు ఇద్దరు సాధారణ పౌరులు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది.