జగిత్యాల పట్టణంలోని తీనాఖానీ చౌరస్తా సమీపంలో గల ఓ గోదాంలో నిబంధనలకు విరుద్ధంగా కాల్షియం కార్బైడ్ బాక్స్లను పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. సహజసిద్ధంగా పండాల్సిన మామిడి, ఇతర పండ్లను కృతిమ పద్ధతిలో త్వరగా పండేలా నిర్దేశిత ప్రమాణాలకు మించి కాల్షియం కార్బైడ్ వినియోగిస్తుంటారు. ఈ తనిఖిల్లో పట్టణ ఎస్ఐ కిరణ్ కుమార్, ఫుడ్ సేఫ్టీ అధికారి శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.