జగిత్యాలలో బుధవారం నిర్వహించిన బిఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ఎంపీ అరవింద్ తో ఉంటున్నాడు. ఏ పార్టీ లో ఉన్నడో అర్థం కావడం లేదు అని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే ఒక రుపాయి కూడా నిధులు తేలేదని, జగిత్యాలలో కెసిఆర్ ఇచ్చిన నిధులతో ఎమ్మెల్యే సంజయ్ శంకుస్థాపనలు చేస్తుండు అన్నారు.